నేను నటిస్తున్న సినిమాల్లోనే చాలా డ్రామా ఉంటుంది.. వ్యక్తిగత జీవితంలో అవసరం లేదు: తాప్సీ

ABN , First Publish Date - 2022-04-04T02:03:52+05:30 IST

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తార.. తాప్సీ. బాలీవుడ్ నుంచి

నేను నటిస్తున్న సినిమాల్లోనే చాలా డ్రామా ఉంటుంది.. వ్యక్తిగత జీవితంలో అవసరం లేదు: తాప్సీ

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తార.. తాప్సీ. బాలీవుడ్ నుంచి వరుస పెట్టి అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం ముంబైలోనే స్థిరపడింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తాను నటిస్తున్న సినిమాల్లోనే చాలా డ్రామా ఉంటుందని, వ్యక్తిగత జీవితంలో అవసరం లేదని ఆమె తెలిపింది.


డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ అయిన మథియాస్‌ బోను తాప్సీ ప్రేమిస్తుంది. గత కొంతకాలంగా అతడితో సహజీవనం చేస్తోంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. పెళ్లికి సంబంధించిన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. ‘‘ఒక్క రోజులోనే ఎటువంటి డ్రామా లేకుండా నా పెళ్లి అయిపోవాలి. నేను నటిస్తున్న సినిమాల్లోనే చాలా డ్రామా ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో అవసరం లేదు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు జుట్టును ఎక్కువగా అలంకరించుకోను. ఎందుకంటే ఆ ఫొటోలను చూసుకుంటే మీకు మీరే భిన్నంగా కనిపిస్తారు. కొత్తగా కనిపిస్తే చూడగలుగుతారా. పెళ్లి నాటి జ్ఞాపకాలు కొద్ది సేపు మాత్రమే ఉండవు. జీవితాంతం మన దగ్గర ఉండాలి. నేటి పెళ్లి కూతుళ్లు విపరీతంగా మేకప్ వేసుకుంటున్నారు. వారిని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది’’ అని తాప్సీ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తాప్సీ ‘శభాష్ మిథు’లో నటిస్తుంది. మిథాలీరాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.

Updated Date - 2022-04-04T02:03:52+05:30 IST