surrogacy : బాలీవుడ్ బ్యూటీకి కవల పిల్లలు
ABN , First Publish Date - 2021-11-18T18:02:47+05:30 IST
తామిద్దరం ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామని ప్రీతి సొషల్ మీడియాలో పేర్కొంది. ‘‘మా హృదయాలు కృతజ్ఞతా భావంతో నిండిపోయాయి’’ అంటూ ఫ్యాన్స్కి తన పిల్లల పేర్లు కూడా చెప్పింది.
తెలుగు వారికి కూడా బాగా పరిచయమున్న బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతా తాను కవల పిల్లలకు తల్లి అయినట్టు ప్రకటించింది. అయితే, ప్రీతి జింతా, ఆమె భర్త జెనె గుడ్ఎనఫ్ సహజ పద్ధతిలో కాక సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారు. తామిద్దరం ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామని ప్రీతి సొషల్ మీడియాలో పేర్కొంది. ‘‘మా హృదయాలు కృతజ్ఞతా భావంతో నిండిపోయాయి’’ అంటూ ఫ్యాన్స్కి తన పిల్లల పేర్లు కూడా చెప్పింది. ‘‘జై జింతా గుడ్ఎనఫ్, గియా జింతా గుడ్ఎనఫ్కు మా కుటుంబంలోకి స్వాగతం...’’ అంటూ ట్విట్టర్లో మెసేజ్ను పోస్ట్ చేసింది ప్రీతి.
గత కొంత కాలంగా అద్దె గర్భం పద్ధతిలో సంతానాన్ని పొందుతోన్న బాలీవుడ్ సెలబ్రిటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రెండో తనయుడు అబ్రామ్ని సరోగసీ ద్వారానే పొందినట్లు ప్రకటించాడు. డైరెక్టర్ కరణ్ జోహర్, నిర్మాత ఏక్తా కపూర్, ఆమె సోదరుడు తుషార్ కపూర్ కూడా పెళ్లి చేసుకోకుండానే పేరెంట్స్ అయ్యారు!