Pooja Hegde: తోటలో పండ్లు కోస్తున్న బుట్టబొమ్మ.. నీకోసమే అంటూ..
ABN , First Publish Date - 2022-07-17T15:41:58+05:30 IST
టాలీవుడ్తోపాటు కోలీవుడ్, బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న బ్యూటీ పూజా హెగ్డే. ‘మాస్క్’ అనే సినిమాతో సినీ పరిశ్రమకి..
టాలీవుడ్తోపాటు కోలీవుడ్, బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde). ‘మాస్క్’ (Mask) అనే సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమైన ఈ భామ ప్రస్తుతం కెరీర్లోనే పిక్ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబిజేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఈ బ్యూటీ అభిమానులకి బుట్టబొమ్మగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న ఈ భామ అత్యధిక పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్తోపాటు ఇతర చిత్ర పరిశ్రమల్లోని పాపులర్ నటులు, నటీమణులకు సొంతంగా ఫామ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ యాక్టర్స్ ఆ ఫామ్స్లో సేంద్రియ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తుంటారు. పూజాకి సైతం సొంతంగా ఓ ఫామ్ ఉంది. ఆ తోటలో చెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు, రెడ్ కురెంట్స్, బ్లాక్ కురెంట్స్ని పండిస్తోంది. తాజాగా ఈ తన తోటలో పండ్లని కోస్తున్న ఫోటోలని షేర్ చేసింది. వాటికి.. ‘నీ కోసం సంతోషంగా పండ్లు కోసే వ్యక్తి ఇక్కడ ఉంది’ అంటూ క్యాప్షన్ సైతం రాసుకొచ్చింది. ఆ ఫొటోల్లో.. ఎంతో ఆహ్లాదంగా నవ్వుతున్న పూజాని చూసి నటి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘ఈ భూమి మీద ఉన్న నిజమైన అందగత్తెవి నువ్వే’ అంటూ కొందరు.. ‘ఇలా హాట్గా, అందంగా ఉన్నావు’ అని మరికొందరూ.. ‘నేను నీకు నెంబర్ ఫ్యాన్’ అంటూ ఇంకొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ‘నాకు కొన్ని స్ట్రాబెర్రీలు కావాలి’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. కాగా.. పూజా ప్రస్తుతం మహేశ్ బాబు (Mahesh babu), త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘జనగణమన’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తోంది. అంతేకాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే బాలీవుడ్ మూవీ చేస్తోంది.