నటితో పాటు మరో ఇద్దరూ స్నేహితులు వారానికే ట్యూషన్ మానేశారు.. ఆ టీచర్ ఏం చేశాడో నిజాలు తెలిపిన యాక్ట్రెస్..

ABN , First Publish Date - 2021-11-24T17:30:32+05:30 IST

దేవోలీనా భట్టాచార్జీ హిందీ ‘బిగ్‌బాస్ 15’లోకి ప్రవేశించనునున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నటి మీడియాతో చురుకుగా ఇంటరాక్ట్ అవుతూ ఎవరికీ తెలియని విషయాలను వెల్లడిస్తోంది..

నటితో పాటు మరో ఇద్దరూ స్నేహితులు వారానికే ట్యూషన్ మానేశారు.. ఆ టీచర్ ఏం చేశాడో నిజాలు తెలిపిన యాక్ట్రెస్..

దేవోలీనా భట్టాచార్జీ హిందీ ‘బిగ్‌బాస్ 15’లోకి తిరిగి ప్రవేశించనునున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తార మీడియాతో చురుకుగా ఇంటరాక్ట్ అవుతూ ఎవరికీ తెలియని విషయాలను వెల్లడిస్తోంది. ఇటీవలే ఆమె ఉమర్ రియాజ్, రష్మీ దేశాయ్ చేసిన అనేక విషయాలను గురించి తెలుపగా.. తాజాగా తనతో ఓ టీచర్ చేసిన మిస్ బిహేవియర్ గురించి వెల్లడించింది.


తాజాగా దేవోలీనా ఫ్లిప్‌కార్ట్ లేడీస్ వర్సెస్ జెంటిల్‌మన్ సీజన్ 2లో పాల్గొంది. ఈ షోలో ఆమెతో పాటు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, జే భానుశాలి, టెరెన్స్ లూయిస్ కూడా ఉన్నారు. ఆ షోలో  ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ‘అతను మంచి టీచర్. అందరూ అతని దగ్గరకి ట్యూషన్‌కి వెళ్లేవారు. అలాగే నా ఇద్దరూ ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. ఓ వారం వెళ్లిన తర్వాత సడెన్ మానేశారు. నాకర్థం కాలేదు. 


తర్వాత నేను కూడా ట్యూషన్‌కి వెళ్లాను. అప్పుడు అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. వెంటనే ఇంటికి వెళ్లి అమ్మకు చెప్పగా.. అతని భార్యకి కంప్లైంట్ చేసింది. అతనిపై గట్టిగా యాక్షన్ తీసుకోవాలని భావించాను. ఎందుకంటే నా మరో ఇద్దరూ ఫ్రెండ్స్ ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్నారు. బహుశా ఇదే అనుభవం వారికి ఎదురై ఉండొచ్చు. అందుకే కొన్ని రోజులకి వారు కూడా మానేశార’ని వెల్లడించింది.  పిల్లలతో తప్పుగా ప్రవర్తించే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి వారి వల్ల ఇతరులు ఇబ్బంది పడరని ప్రేక్షకులని కోరింది ఈ బ్యూటీ.



Updated Date - 2021-11-24T17:30:32+05:30 IST