సినిమాగా తెరకెక్కనున్న ట్వింకిల్ ఖన్నా ‘కథ’...

ABN , First Publish Date - 2022-04-27T04:27:29+05:30 IST

అప్పుడెప్పుడో మన ‘శీను’ సినిమాలో వెంకటేశ్ సరసన హీరోయిన్ గా నటించిన ట్వింకిల్ తరువాతి కాలంలో తెరకు పూర్తిగా దూరమైంది. తనకు తానుగానే... నటనకు నేను పనికిరానని నిర్మొహమాటంగా చెప్పే ఆమె... పెన్ తో మాత్రం అద్భుతంగా ఫన్ పండిస్తుంది...

సినిమాగా తెరకెక్కనున్న ట్వింకిల్ ఖన్నా ‘కథ’...

రాజేశ్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ కూతురుగా, లెజెండ్రీ డింపుల్ కపాడియా వారసురాలిగా ట్వింకిల్ ఖన్నా మనకు తెలుసు. అక్షయ్ కుమార్ భార్యగా కూడా ఆమె మనకు పరిచయమే. అయితే, ‘మిసెస్ ఫన్నీబోన్స్’గా మీడియాలో పేరు తెచ్చుకున్న ఆమె చక్కటి రచయిత్రి కూడా. ఈ విషయం సౌత్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో మన ‘శీను’ సినిమాలో వెంకటేశ్ సరసన హీరోయిన్ గా నటించిన ట్వింకిల్ తరువాతి కాలంలో తెరకు పూర్తిగా దూరమైంది. తనకు తానుగానే... నటనకు నేను పనికిరానని నిర్మొహమాటంగా చెప్పే ఆమె... పెన్ తో మాత్రం అద్భుతంగా ఫన్ పండిస్తుంది. అలా ఆమె రాయగా 2016లో అచ్చైన ఓ షార్ట్ స్టోరీ... ‘సలామ్ నోనీ అప్పా’... 


‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పేరుతో ట్వింకిల్ ఖన్నా 2016లో ఓ పుస్తకం ప్రచురించింది. ఆ ఆంథాలజీలోని నాలుగు కథల్లో ఒకటే... ‘సలామ్ నోనీ అప్పా’. ఇప్పుడు అదే షార్ట్ స్టోరీని సినిమాగా తీయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని మూవీ వర్షన్ కి సోనల్ దబ్రాల్ దర్శకత్వం వహించనున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా ఎంతో పేరున్న తనకి ఇదే మొదటి ఫుల్ లెంగ్త్ సినిమా. అలాగే, ట్వింకిల్ ఖన్నా తన కథని సినిమాగా మార్చే ప్రయత్నంలో నిర్మాతగా కూడా సత్తా చాటనుంది. ఆమె బ్యానర్ ‘మిసెస్ ఫన్నీబోన్స్ మూవీస్’తో పాటూ ‘అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా సినిమాని నిర్మించనున్నాయి. ట్వింకిల్ గ్రాండ్ మదర్, ఆమె సిస్టర్ మధ్య రిలేషన్ కి స్టోరీ రూపమే... ‘సలామ్ నోనీ అప్పా’!

Updated Date - 2022-04-27T04:27:29+05:30 IST