మీరు అలా అన్నారంటూ.. Amitabh Bachchan షోలో కన్నీరు పెట్టుకున్న జాన్ అబ్రహం

ABN , First Publish Date - 2021-11-25T17:24:11+05:30 IST

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షోకి ఎంతోమంది స్టార్స్ సినిమాల ప్రమోషన్ కోసం వస్తుంటారు..

మీరు అలా అన్నారంటూ.. Amitabh Bachchan షోలో కన్నీరు పెట్టుకున్న జాన్ అబ్రహం

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షోకి ఎంతోమంది స్టార్స్ సినిమాల ప్రమోషన్ కోసం వస్తుంటారు. తాజాగా ఈ షోకి ‘సత్యమేవ జయతే 2’ స్టార్ జాన్ అబ్రహం, తన కో-స్టార్ దివ్యా ఖోస్లా కుమార్‌తో కలిసి పాల్గొన్నాడు.


కేబీసీ తాజా ఎపిసోడ్ ప్రొమోని సోషల్ మీడియాలో విడుదల చేసింది సోనీ టీవీ. అందులో కొన్ని ఫన్నీ విషయాలను, మరి కొన్ని బాధకరమైన సంగతులను పంచుకున్నాడీ స్టార్. ఈ ‘ధూమ్’ స్టార్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను అనుకరించి చూపించడం, వెలిపై ఫుట్ బాల్‌తో ట్రిక్స్ చేసి చూపించాడు. అనంతరం బిగ్ బీ కూడా ఫుట్‌బాల్‌ని వెలిపై తిప్పే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. అనంతరం ఈ హీరో షర్ట్ లేపి తన సిక్స్ ప్యాక్ చూపించగా.. అందరూ అరిచారు. వెంటనే సూపర్ స్టార్ కేవలం ఆడవాళ్లు మాత్రమే అరుస్తున్నారు చూడు అంటూ టీజ్ చేశాడు.


జాన్, అమితాబ్‌తో మాట్లాడుతూ.. ‘‘ధూమ్’ మూవీ విడుదలైన తర్వాత నేను బైక్‌పై మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశాను. అప్పుడు మీరు బైక్ విషయంలో అభిషేక్‌ని ఎంకరేజ్ చేయొద్దని ప్లీజ్ అన్నారు. ఆ సమయంలో పైనుంచి రావడం చూసి మాట మారుస్తూ.. బైక్ బావుంది అన్నార’ని చెప్పగా ఆయన గట్టిగా నవ్వేశాడు.


అనంతరం జాన్ ఎదో బాధ కలిగించే విషయం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన్ను చూసి బిగ్ బీతో పాటు అక్కడున్న వారంతా బాధపడ్డారు. అయితే ఈ ‘ధూమ్’ స్టార్ దేని గురించి చెప్పాడనేది మాత్రం రివీల్ చేయలేదు. ఈ షో ప్రొమో ఆడియన్స్‌కి ఎంతో ఆసక్తి కలిగించేలా ఉండగా.. ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..



Updated Date - 2021-11-25T17:24:11+05:30 IST