Prithviraj: Akshay Kumar సినిమాకి ఆ మూడు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు.. ధన్యవాదాలంటూ..

ABN , First Publish Date - 2022-06-03T17:17:04+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్(Samrat Prithviraj)’. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా..

Prithviraj: Akshay Kumar సినిమాకి ఆ మూడు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు.. ధన్యవాదాలంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్(Prithviraj)’. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా.. మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్‌ భారీ స్థాయిలో నిర్మించింది. ఇటీవల అక్షయ్ చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగలడంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే ధ్యేయంతో ఈ సినిమాని చేశాడు. ఈ తరుణంలో ఆయన కొత్త చిత్రం జూన్ 3న విడుదలైంది.


అయితే.. విడుదలకి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Aditynath) కోసం ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. సినిమాని చూసిన ఆయన బావుందని, భారతదేశ సంస్కృతిని చూపించారని దర్శకుడిని, నటీనటులను ప్రశంసించారు. అనంతరం కలెక్షన్లపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో  ప్రకటించారు. అనంతరం అక్షయ్ కుమార్ ఆయన పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. యోగి ఆదిత్యనాథ్ గారు’ అంటూ ట్వీట్ చేశారు.


అనంతరం మరో రెండు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు సైతం పన్ను మినహాయింపునిచ్చాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan).. ‘గొప్ప యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ జీవితంపై అక్షయ్ కుమార్ తీసిన  చిత్రానికి మధ్యప్రదేశ్‌లో పన్ను మినహాయింపు ఇస్తున్నాం. యువత ఎక్కువ సంఖ్యలో సినిమాని చూసి ఆయన గురించి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీనికి అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘చౌహాన్ శివరాజ్ జీ మీ నిర్ణయం భారతదేశపు గొప్ప యోధుని అద్భుతమైన కథను మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుంది. మూవీటీం నుంచి మీకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.


కొద్దిసేపటికే..  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) సైతం.. ‘సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రానికి ఉత్తరాఖండ్‌లో పన్ను మినహాయింపు ఇస్తున్నాం. దేశభక్తి, ధైర్యం నిండిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడండి’ అంటూ రాసుకొచ్చారు. కాగా.. సంజయ్ దత్, సోనూ సూద్ వంటి దక్షిణాదిన పాపులారిటీ ఉన్న యాక్టర్స్ నటించిన.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదలయ్యింది.







Updated Date - 2022-06-03T17:17:04+05:30 IST