‘Maggie ని కూడా ఇంత త్వరగా తయారు చేయలేం’.. Akshay Kumar పై విపరీతమైన ట్రోలింగ్

ABN , First Publish Date - 2022-07-10T15:48:26+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ నటుడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ...

‘Maggie ని కూడా ఇంత త్వరగా తయారు చేయలేం’.. Akshay Kumar పై విపరీతమైన ట్రోలింగ్

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్ (Samrat Prithviraj)’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు మూవీస్‌ కూడా డిజాస్టర్స్‌గా మిగిలాయి. అందులో.. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ బయోపిక్‌గా తెరకెక్కింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత రూ.80 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మూవీ ఫ్లాఫ్ నుంచి బయటపడక ముందే అక్షయ్ తాజాగా జస్వంత్ సింగ్ గిల్ జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్‌ని ప్రకటించాడు.


దీంతో అక్షయ్ కుమార్‌పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఒక ఫ్లాప్‌ని తట్టుకోకముందే మరో దానికి రెడీ అవుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అక్షయ్ కుమార్ సినిమా చేసినంత వేగంగా.. మ్యాగీని కూడా తయారు చేయలేం’ అని ఓ నెటిజన్.. ‘నిన్ను సంవత్సరానికి నాలుగుసార్లు చూడడం కష్టంగా ఉంది’ అని మరొకరు.. ‘పృథ్వీరాజ్ సినిమాలో మీ సిల్లీ ఫర్ఫామెన్స్ చూసి కష్టంగా అనిపిస్తోంది.. కొంచెం రిలాక్స్ కానివ్వండి’ అని మరికొందరూ కామెంట్స్ చేశారు. కాగా.. అక్షయ్ కుమార్ ప్రస్తుతం అన్నాచెల్లెళ్ల బంధంపై వస్తున్న ‘రక్షా బంధన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో భూమీ పడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అయితే.. పృథ్వీరాజ్ సినిమా ప్రభావం కారణంగా ఈ ట్రైలర్‌కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.









Updated Date - 2022-07-10T15:48:26+05:30 IST