Kapil Sharma: సినిమా సెట్‌‌లో కపిల్‌ శర్మని కొట్టి.. మెడపట్టి బయటికి గెంటానంటున్న యాక్షన్ డైరెక్టర్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-30T18:54:28+05:30 IST

‘ది కపిల్ శర్మ షో(The Kapil Sharma Show)’.. ఈ హిందీ పాపులర్ షోకి దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే...

Kapil Sharma: సినిమా సెట్‌‌లో కపిల్‌ శర్మని కొట్టి.. మెడపట్టి బయటికి గెంటానంటున్న యాక్షన్ డైరెక్టర్.. కారణం ఏంటంటే..

‘ది కపిల్ శర్మ షో(The Kapil Sharma Show)’.. ఈ హిందీ పాపులర్ షోకి దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎందరో బాలీవుడ్ సెలబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. వారి సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈ షోలో కపిల్‌ కామెడీ టైమింగ్‌కి ఎంతో అభిమానులు ఉన్నారు. అలాంటి ఈ యాంకర్‌ని ఓ యాక్షన్ డైరెక్టర్ మెడ పట్టి సినిమా సెట్‌ నుంచి బయటికి నెట్టేశాడంట. దాని గురించి స్వయంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


బాబీ డియోల్, అమిషాపటేల్ (Ameesha patel) నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గడార్ (Gadar): ఎక్ ప్రేమ్ కథ’. 2001లో విడుదలైన ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా టిను వర్మ వ్యవహరించాడు. ఆ సినిమా గురించి వెటరన్ యాక్టర్ ముఖేశ్ ఖన్నాతో మాట్లాడుతూ కపిల్‌ని  కొట్టి సినిమా సెట్ నుంచి బయటికి నెట్టిన విషయాలను తెలిపాడు. టిను మాట్లాడుతూ.. ‘కపిల్ శర్మ ఈ ఘటన గురించి తన షోలో కూడా మాట్లాడాడు. నటుడుగా మారాలని ఉంటే గదర్ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌కి వెళ్లామని కపిల్ తండ్రి అతనికి చెప్పాడు. అందుకే సినిమాలో పని చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ఓ సీన్ తీయడానికి అన్ని సిద్ధం చేసుకుని, యాక్షన్ చెప్పి, ఫ్రేమ్ వైపు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి వ్యతిరేక దిశలో పరుగెత్తడం చూశాను.


నేను అతనిని పిలిచి, ఎందుకు అలా చేశావని అడిగాను. నీ వల్ల ఈ టేక్ ఉపయోగం లేకుండా పోయింది. మరోసారి టేక్ చేయాల్సి వస్తోందని చెప్పాను. ఇలా పరిగెత్తూ అని అతనికి చూపించి.. యాక్షన్ చెప్పాను. అయినప్పటికీ ఇంతకుముందు చేసినట్లే మరోసారి వ్యతిరేక దిశలో నడిచాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే కెమెరాని కింద పెట్టేసి పరుగెత్తుకుంటూ వెళ్లి చెంప మీద కొట్టాను. అనంతరం మెడ పట్టుకొని సెట్ నుంచి బయటికి నెట్టేశాను. ఆ  వ్యక్తే ఇప్పుడు టాప్ యాంకర్ కపిల్ శర్మ’ అని చెప్పుకొచ్చాడు.


‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ 2001లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత సన్నీ డియోల్, అమీషా పటేల్ మళ్లీ కలిసి ఈ సినిమా కోసం పని చేయనున్నారు. మొదటి సినిమాలోని పాత్రలనే ఈ సినిమాలోనూ పోషించనున్నారు. కాగా.. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న తాజా మూవీకి అనిల్ శర్మ వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - 2022-07-30T18:54:28+05:30 IST