మరో కమెడియన్ హీరో అవుతున్నాడు

ABN , First Publish Date - 2022-01-01T23:18:24+05:30 IST

టాలీవుడ్ తెరపై ఇప్పటికే ఎందరో కమెడియన్లు హీరోలు అయ్యారు. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ‘మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో

మరో కమెడియన్ హీరో అవుతున్నాడు

టాలీవుడ్ తెరపై ఇప్పటికే ఎందరో కమెడియన్లు హీరోలు అయ్యారు. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ‘మళ్ళీ రావా', 'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెప్తా', 'ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో నటుడిగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో ప్రేక్షకలోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం ఇప్పుడు హీరోగా నిరూపించుకునేందుకు రెడీ అయ్యాడు. 


కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో.. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రంతో అభినవ్ గోమఠం హీరోగా పరిచయం కాబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. జనవరి 1వ తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

Updated Date - 2022-01-01T23:18:24+05:30 IST