Assam Floods: 25 లక్షలు డోనేట్ చేసిన ఆమీర్ ఖాన్.. ప్రశంసించిన సీఎం

ABN , First Publish Date - 2022-06-29T15:02:16+05:30 IST

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు...

Assam Floods: 25 లక్షలు డోనేట్ చేసిన ఆమీర్ ఖాన్.. ప్రశంసించిన సీఎం

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 28న అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) తాజా వరద నివేదికను విడుదల చేసింది. అందులో.. 28 జిల్లాల్లోని దాదాపు 2,389 గ్రామాలు వరదల బారిన పడట్లు తెలిపింది. కాగా.. వరదల కారణంగా గత 24 గంటల్లో ఐదుగురు మరణించారు. ఈ తరుణంలో ఎంతోమంది ప్రముఖులు, దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సహాయంగా విరాళాలు అందిస్తున్నారు.


తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ సైతం వరద బాధితులకు సహాయంగా విరాళం ప్రకటించారు. అస్సాం సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ మొత్తంలో రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీంతో ఆయన్ని ప్రశంసిస్తూ సీఎం హిమంతా బిశ్వా శర్మ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల విరాళం అందించి మన రాష్ట్రంలోని వరద బాధతులకి సహాయంగా నిలిచారు. ఆయన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు.


అయితే.. ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటించిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కాగా.. ఈ సినిమాలో కరీనా కపూర్, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.



Updated Date - 2022-06-29T15:02:16+05:30 IST