డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్'..

ABN , First Publish Date - 2022-04-14T18:34:37+05:30 IST

ఇటీవలే థియేటర్స్‌లో విడుదలైన వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్' చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా..రాధిక, ఖుష్బు, ఊర్వశీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్'..

ఇటీవలే థియేటర్స్‌లో విడుదలైన వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్' చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా..రాధిక, ఖుష్బు, ఊర్వశీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన జేమ్స్ కన్నడ నాట మంచి సక్సెస్‌ను సాధించింది. అయితే, నేటి నుంచి ఈ రెండు సినిమాలు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఓటీటీలో ఈ చిత్రాలు ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.  

Updated Date - 2022-04-14T18:34:37+05:30 IST