ఒక్కరు కూడా నచ్చలేదు అని చెప్పడం నేను వినలేదు: శర్వానంద్
ABN , First Publish Date - 2022-03-06T03:18:42+05:30 IST
చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై
చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతుండటంతో.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్రయూనిట్ శనివారం మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. నేను చెప్పినట్లుగానే విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ను వారు వ్యక్తం చేశారు. ఇంటిలోని మహిళలు కూడా చూసే సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీతోనే సినిమాకు వచ్చారు. వచ్చే వారం కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముంది అన్నారు. నా పెళ్లి విషయానికి వస్తే.. సినిమాలో చూపించినట్లుగా మా అమ్మ ఖుష్బూ ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. కానీ మా అమ్మనాన్నలు నీకు నచ్చితే మేం మాట్లాడతాం అని చెప్పారు..’’ అని పేర్కొంది.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘మేం విడుదలకు ముందు ఏదైతే అనుకున్నామో అదే నేడు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. ఇది బాగోలేదని ఒక్కరు కూడా అనడం నేను వినలేదు. మనింటిలో జరిగే కథలా వుంటుంది. మేం నవ్విస్తామని చెప్పాం. అలాగే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. హ్యాపీగా చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతుంటే.. చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు కిశోర్ తిరుమల, నటి రుచిత, నటి దీప్తి, సహ నిర్మాత శ్రీకాంత్ తదితరులు చిత్ర విజయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.