తండ్రీ, కొడుకుల కథ
ABN , First Publish Date - 2022-10-03T06:00:58+05:30 IST
తండ్రీ, కొడుకుల శత్రుత్వం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘లోకమెరుగని కథ’. సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ...
తండ్రీ, కొడుకుల శత్రుత్వం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘లోకమెరుగని కథ’. సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. పూజిత హీరోయిన్. రవికాంత్ జమి నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేంద్రకుమార్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సందేశాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి’ అన్నారు.