ఆస్కార్స్ కాంట్రవర్సీ తరువాత ‘ఆ జంట’ ఇండియాకి ఎందుకు వచ్చారంటే...

ABN , First Publish Date - 2022-04-27T02:09:18+05:30 IST

‘ఆస్కార్స్ 2022’ అనగానే అందరూ విల్ స్మిత్ గురించే మాట్లాడుతున్నారు! కేవలం ఒక్క చెంప దెబ్బతో ఈ హాలీవుడ్ స్టార్ కలకలం రేపాడు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రస్, బెస్ట్ మూవీ గురించి కూడా సగం మంది మరిచిపోయారు. కానీ, అందరికందరూ క్రిస్ రాక్ దవడని విల్ స్మిత్ పగలకొట్టడంపై ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే, ఆస్కార్స్ వేదికపై చోటు చేసుకున్న ఆ షాకింగ్ ఇన్సిడెంట్ తరువాత స్మిత్ కొంత కాలం ఎవరికీ కనిపించకుండా ఉండిపోయాడు. అనూహ్యంగా ఇండియాలో ప్రత్యక్షమయ్యాడు...

ఆస్కార్స్ కాంట్రవర్సీ తరువాత ‘ఆ జంట’ ఇండియాకి ఎందుకు వచ్చారంటే...

‘ఆస్కార్స్ 2022’ అనగానే అందరూ విల్ స్మిత్ గురించే మాట్లాడుతున్నారు! కేవలం ఒక్క చెంప దెబ్బతో ఈ హాలీవుడ్ స్టార్ కలకలం రేపాడు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రస్, బెస్ట్ మూవీ గురించి కూడా సగం మంది మరిచిపోయారు. కానీ, అందరికందరూ క్రిస్ రాక్ దవడని విల్ స్మిత్ పగలకొట్టడంపై ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే, ఆస్కార్స్ వేదికపై చోటు చేసుకున్న ఆ షాకింగ్ ఇన్సిడెంట్ తరువాత స్మిత్ కొంత కాలం ఎవరికీ కనిపించకుండా ఉండిపోయాడు. అనూహ్యంగా ఇండియాలో ప్రత్యక్షమయ్యాడు. ముంబైలో ఎయిర్ పోర్ట్ నుంచీ బయటకొస్తూ ఫ్యాన్స్ తో కలసి సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. ఇంతకీ, విల్ స్మిత్ సడన్ గా ఇండియాకి ఎందుకొచ్చినట్టు? 


విల్ స్మిత్ ఆస్కార్స్ వేదిక మీద ప్రపంచం ముందు విలన్ అయిపోయాడు. అందుకు ఒక విధంగా, కొంత వరకూ... ఆయన భార్య కూడా కారణం. ఆమెకు తల మీద వెంట్రుకలు రాలిపోయే వ్యాధి ఉండటం, దాని గురించి తెలిసో, తెలియకో క్రిస్ రాక్ జోక్ పేల్చటం, విల్ స్మిత్ అతడి చెంప ఛళ్లుమనిపించటం... చకచకా జరిగిపోయాయి. ఆమె మీద ఉన్న ప్రేమ, గౌరవం కారణంగానే స్మిత్ అటువంటి హింసకు దిగాడు. ఫలితంగా 10 ఏళ్ల పాటూ ఆస్కార్స్ సంబరాల వైపు రానేరావద్దంటూ నిషేధం కూడా విధించింది అకాడమీ. అయితే, క్రిస్ రాక్ కామెంట్ చేసినప్పుడు స్మిత్ కాస్త ఓపిక పట్టి ఉంటే ఇంత రచ్చ జరిగేదే కాదు. 


భార్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ మేకర్ అయిన విల్ స్మిత్... అదే మిసెస్ స్మిత్ కారణంగా... ఇండియా వచ్చాడట. హాలీవుడ్ మీడియా తాజా కథనాల ప్రకారం, జాడా పింకెట్ స్మిత్ భారతదేశానికి వెకేషన్ కోసం వెళదామని పట్టుబట్టినట్టు సమాచారం. నిజానికి ఆస్కార్స్ లో గొడవ కాక ముందే స్మిత్ దంపతులు ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. కానీ, అకాడమీ పురస్కారాల సమయంలో నానా రచ్చ జరగటంతో భారతదేశ సందర్శన వద్దనుకున్నారట. అయితే, జాడా పట్టుబట్టి విల్ స్మిత్ ని మన దేశానికి తీసుకొచ్చిందని అమెరికాలో చెప్పుకుంటున్నారు. అంతే కాదు, ఆమే స్వయంగా ఓ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది. ‘రెడ్ టేబుల్ టాక్’ అనే తన రెగ్యులర్ టాక్ షోతో మరోసారి జనం ముందుకు రాబోతున్నానని జాడా తెలియజేసింది. దాంతో పాటూ గత కొన్ని వారాల్లో ‘స్మిత్ ఫ్యామిలీ’లో జరిగిన అనేక సంఘటనలు కూడా టేబుల్ వద్ద చర్చిద్దామని ఆమె అంది. అంటే... మిసెస్ స్మిత్ కెమెరాలకు ముఖం చాటేయకూడదని అనుకుంటోందా? అంతే అంటున్నారు హాలీవుడ్ లోని వారు. అందుకోసమే ఇండియాకి వచ్చి మీడియాకి కనిపించారని టాక్... 

Updated Date - 2022-04-27T02:09:18+05:30 IST