50 రకాల వంటకాలతో రాజుగారి భోజనం!
ABN , First Publish Date - 2022-09-30T11:53:59+05:30 IST
ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఆయన స్వస్థలమైన మొగల్తూరులో గురువారం జరిగింది...
ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఆయన స్వస్థలమైన మొగల్తూరులో గురువారం జరిగింది. కృష్ణంరాజు భార్య శ్యామల, పిల్లలు, ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సొంత ఊరికి వెళ్లారు ప్రభాస్. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు స్ధానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారందరినీ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ప్రభాస్ పలకరించి అభివాదాలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్ కోరారు. కృష్ణంరాజు భోజన ప్రియుడు కావడంతో ఆయనకు ఇష్టమైన వంటకాలను వండి వడ్డించారు. ఈ విందు కోసం 50 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు తయారు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే మొదలైన భోజన కార్యక్రమం సాయంత్రం వరకూ కొనసాగింది. దాదాపు 40 వేల మంది భోజనాలు చేసి ఉంటారని ఓ అంచనా.