సుశాంత్ అభిమానినంటూ... సీఎం తనయుడ్నే చంపేస్తానని వార్నింగ్!
ABN , First Publish Date - 2021-12-24T00:15:24+05:30 IST
తనని తాను దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానిగా చెప్పుకున్న ఓ వ్యక్తి ఏకంగా మహారాష్ట్ర సీఎం తనయుడికే వార్నింగ్ ఇచ్చాడు. బెంగుళూరుకి చెందిన జైసింగ్ రాజ్పుత్ను ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
తనని తాను దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానిగా చెప్పుకున్న ఓ వ్యక్తి ఏకంగా మహారాష్ట్ర సీఎం తనయుడికే వార్నింగ్ ఇచ్చాడు. బెంగుళూరుకి చెందిన జైసింగ్ రాజ్పుత్ను ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
‘‘డిసెంబర్ 8న అతను(జైసింగ్ రాజ్పుత్) మినిస్టర్(ఆదిత్య థాక్రే)కి ఫోన్ చేశాడు. మంత్రి అతడి కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో చంపేస్తానంటూ బెదిరింపు మెసేజీలు పంపించాడు’’ అంటూ ముంబై పోలీసులు జరిగిన దానిపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అదుపులో ఉన్న జైసింగ్ గురించిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇది తీవ్రమైన విషయం’’ అని వ్యాఖ్యానించిన ఆయన మహారాష్ట్ర హోమ్శాఖ ఈ కేసుని దర్యాప్తు చేస్తుందని అన్నారు.
2020లో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం తరువాత చాలా మందిపై అనుమానాలు రేకెత్తాయి. సుశాంత్ ప్రియురాలు రిచా చక్రవర్తి అరెస్ట్ కూడా అవ్వాల్సి వచ్చింది. అయితే, అదే సమయంలో మహా సీఎం తనయుడు, రాష్ట్ర మంత్రి అయిన ఆదిత్య థాక్రే పేరు కూడా వినిపించింది. కొందరు సుశాంత్ మరణానికి అతడ్ని కూడా కారణంగా చెప్పుకున్నారు. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇంత వరకూ బయటకు రాలేదు. ఎలాంటి పోలీసు కేసులు కూడా నమోదు కాలేదు. కానీ, ఇప్పుడు సుశాంత్ అభిమానినంటూ జైసింగ్ రాజ్పుత్ తెర మీదకు రావటం, అతను ఆదిత్య థాక్రే చంపుతానని బెదిరించటం మరోసారి కలకలానికి దారితీసింది. చూడాలి, విచారణలో జైసింగ్ ఎలాంటి సంగతులు చెబుతాడో మరి...