టర్కీలో HEROINE పెళ్లి... India లో చెల్లదన్న కోర్టు!

ABN , First Publish Date - 2021-11-18T17:19:01+05:30 IST

నుస్రత్ జహాన్... కోల్‌కతా సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న నటి. అంతే కాదు, ఆమె ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుఫున పార్లమెంట్‌లో ఎంపీ కూడా. ఏక కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో రాణిస్తోన్న బెంగాలీ బ్యూటీ చాలా రోజులుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది...

టర్కీలో HEROINE పెళ్లి... India లో చెల్లదన్న కోర్టు!

నుస్రత్ జహాన్... కోల్‌కతా సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న నటి. అంతే కాదు, ఆమె ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుఫున పార్లమెంట్‌లో ఎంపీ కూడా. ఏక కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో రాణిస్తోన్న బెంగాలీ బ్యూటీ చాలా రోజులుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కోల్‌కతా నగరంలోని ఓ కోర్టు ఆమె గత వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. 


నుస్రత్ జహాన్ 2019 జూన్ నెలలో నిఖిల్ జైన్‌ను పెళ్లాడింది. అయితే, వారి నిఖా ఇక్కడ జరగలేదు. టర్కీ దేశంలో అక్కడి చట్టాలకు అనుగుణంగా చోటు చేసుకుంది. అదే విషయాన్ని కొన్నాళ్ల క్రితం నుస్రత్ జహాన్ పబ్లిగ్గానే చెప్పింది. నిఖిల్ జైన్‌తో తన టర్కీ మ్యారేజ్ ఇండియాలో చెల్లదని ఆమె అప్పట్లో కామెంట్ చేసింది. తాజాగా కోర్టు కూడా అదే చెప్పింది. టర్కీలో జరిగిన వివాహం ఇండియాలో లీగల్ కాదని తీర్పునిచ్చింది. 


నిఖిల్ జైన్‌ నుంచీ విడిపోయిన నుస్రత్ జహాన్ ప్రస్తుతం బెంగాలీ నటుడు యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్ కొనసాగిస్తోంది. అయితే, వారిద్దరూ ఇంత వరకూ తమ బంధాన్ని ధృవీకరించలేదు. కొన్నాళ్ల క్రితం దీపావళి వేళ తన తనయుడితో కలసి తీసుకున్న ఫోటోను నుస్రత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ చంటి పిల్లాడు యశ్‌ దాస్‌గుప్త కొడుకేనంటూ బెంగాలీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఇప్పుడు నుస్రత్ గత వివహం గురించి కోర్టు తీర్పు రావటంతో, తృణమూల్ ఎంపీ తన సహ జీవనం సంగతి, అధికారికంగా అంగీకరిస్తుందని అంతా భావిస్తున్నారు...    

Updated Date - 2021-11-18T17:19:01+05:30 IST