Kiara Advani‌ ని భయపెట్టిన అభిమాని

ABN , First Publish Date - 2022-07-04T20:28:18+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ కియారా అడ్వాణీ (Kiara Advani). ‘ఎమ్‌ఎస్. ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘కబీర్ సింగ్’, ‘షేర్ షా’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె

Kiara Advani‌ ని భయపెట్టిన అభిమాని

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ కియారా అడ్వాణీ (Kiara Advani). ‘ఎమ్‌ఎస్. ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘కబీర్ సింగ్’, ‘షేర్ షా’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపింది. తనకు ఎదురైన భయంకరమైన(scariest) అనుభవాన్ని తెలిపింది. 


ఓ అభిమాని సమాచారం ఇవ్వకుండా తన ఇంటికి వచ్చాడని ఆ సమయంలో ఎంతో భయమైందని కియారా అడ్వాణీ చెప్పింది. ‘‘నేను ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో ఉంటాను. ఓ అభిమాని నన్ను కలుసుకోవడానికి  ఇంటికి వచ్చాడు. మెట్లు ఎక్కి రావడంతో విపరీతంగా చెమటలు కక్కుతున్నాడు. నేను అప్పుడు ఏమైంది? మీరు బాగున్నారా? నీళ్లు తాగుతారా? వంటి కుశల ప్రశ్నలు అడిగాను. తనకు ఏం వద్దన్నాడు. మెట్లు ఎక్కి రావడంతో చెమటలు వస్తున్నాయన్నాడు. అతడు తేరుకున్నాక నేను మరో సారి నా ఇంటికి రావద్దు. కొంచెం భయంగా ఉందన్నాను. కానీ, అతడు మంచి వ్యక్తి’’ అని కియారా అడ్వాణీ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా కియారా అడ్వాణీ ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2)లో నటించింది. ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. దాదాపుగా రూ. 190కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. కియారా నటించిన మరో చిత్రం ‘జుగ్‌జుగ్ జీయో’ (Jugjugg Jeeyo) ప్రస్తుతం థియేటర్స్‌లో నడుస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. 

Updated Date - 2022-07-04T20:28:18+05:30 IST