అల్లు అర్జున్ కోసం లోకేశ్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్.. హీరోయిన్గా పూజా ఫిక్స్?
ABN , Publish Date - Jun 28 , 2026 | 10:47 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా పూర్తికాగానే బన్నీని అస్సలు వెయిట్ చేయించకూడదనే పట్టుదలతో ఉన్నాడట లోకేశ్ కనగరాజ్. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా, ముందుగానే ఒక భారీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడానికి ప్రీ-ప్రొడక్షన్ పనులను లోకేశ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడట. క్యారెక్టర్ డిజైన్, స్క్రిప్ట్ ఫైనలైజేషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి కీలకమైన పనులన్నింటినీ అనుకున్న సమయం కంటే ముందే ముగించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే రీసెంట్గా ముంబయిలో అల్లు అర్జున్పై ఒక స్పెషల్ లుక్ టెస్ట్ను కూడా లోకీ కంప్లీట్ చేసినట్లు సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా, తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ లోకేశ్ డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ను ఎంపిక చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు టాలీవుడ్ బజ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. దాంతో ఈ హిట్ పెయిర్ సెంటిమెంట్ను మళ్లీ రిపీట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. 'కూలీ' సినిమాలో పూజా హెగ్డేను కేవలం ఒక స్పెషల్ సాంగ్కే పరిమితం చేసిన లోకీ, అల్లు అర్జున్ సినిమాలో మాత్రం ఆమెకు ఫుల్ లెంత్ పవర్ఫుల్ రోల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.
ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టాలీవుడ్ను పక్కన పెట్టి బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని చూసినా, అక్కడ ఆశించిన సక్సెస్ దక్కలేదు. దాంతో తనకు అచ్చొచ్చిన తెలుగు ఇండస్ట్రీని దూరం పెడితే కెరీర్కే ప్రమాదమని గ్రహించిన ఈ బ్యూటీ, రూట్ మార్చి టాలీవుడ్లో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తోందట. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మరోవైపు ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళ్ ఫిల్మ్ 'జన నాయగన్' ఇంకా రిలీజ్ కాకపోవడంతో, బన్నీ-లోకీ ప్రాజెక్ట్ గనుక ఫైనల్ అయితే పూజా హెగ్డే కెరీర్కు ఇది ఒక మైండ్బ్లోయింగ్ గోల్డెన్ ఛాన్స్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో పూజా హెగ్డేకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి!.