అల్లు అరవింద్ ఇంటికి సీఎం చంద్రబాబు.. శిరీష్ దంపతులకు ఆశీర్వాదం
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:38 AM
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, నయనికా రెడ్డి వివాహాం ఇటీవల హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
అల్లు వారి వారసుడు అల్లు అరవింద్ (Allu Aravind) కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish), నయనికా రెడ్డి (Nayanika Reddy) ల వివాహాం ఇటీవల హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ నాయకలు భారీగా విచ్చేసి నూతన దంపతులను అశీర్వదించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ కార్యానికి హజరు హయ్యారు. అయితే ఆ సమయంలో వివిధ పనులో బిజీగా ఉన్న అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ వేడుకకు హజరు కాలేక పోయారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వివాహం జరిగిన వారం రోజుల తర్వాత శనివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి స్వయంగా వెళ్లి నూతన వధూవరులను అశీర్వదించారు. పూల బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అక్కడే కాసేపు ఉండి అరవింద్ కుటుంబ సభ్యలుతో కాసేపు గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివివిగా హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ సీఎం చంద్రబాబు నాయుడుకి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.