'నాగబంధం'కు సెట్స్ స్పెషల్ ఎసెట్: ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:24 PM
ప్రముఖ దర్శకుడు అశోక్ కుమార్ తాజా చిత్రం 'నాగబంధం'. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ కుమార్ వేసిన సెట్స్ స్పెషల్ ఎసెట్ కానున్నాయి. ఈ సినిమా జూలై 3న విడుదల కానుంది.
టాలీవుడ్లో టాప్ ఆర్ట్ డైరెక్టర్స్ లో అశోక్ కుమార్ కూడా ఒకరు. పేరుకు మలయాళీ అయినా... తెలుగులో వందకు పైగా చిత్రాలకు, అదీ టాప్ స్టార్స్ సినిమాలకు వర్క్ చేశారు అశోక్ కుమార్. అప్పట్లో ఆయన 'ఒక్కడు' సినిమాకు వేసిన చార్మినార్ సెట్ ట్రెండ్ సెట్టర్గా మారింది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేశారు. తాజాగా జూలై 3న రాబోతున్న 'నాగబంధం'కు ఆయనే వర్క్ చేశారు. ఈ సినిమా కోసం అశోక్ కుమార్ పద్మనాభ స్వామి దేవాలయంతో పాటు ఆరేడు భారీ సెట్స్ వేశారు. ఆయనతో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్స్ హెడ్ ఎన్.ఎస్.ఆర్. చేసిన ప్రత్యేక ముఖాముఖి: