కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. భ‌క్తి మార్గం ప‌ట్టిన స్టార్ హీరోలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:57 PM

తమిళ చిత్రపరిశ్రమలో ఆధ్యాత్మిక సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. సూర్య 'కరుప్పు' హిట్ తర్వాత శివకార్తికేయన్, ధనుష్, నయనతార కూడా భక్తి కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

dhanush siva

తమిళ చిత్రపరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ పెరుగు తోంది. ఎన్నడూ లేని విధంగా పెద్ద హీరోలు సైతం ఆధ్యాత్మిక చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ యేడాదిలో ఇటీవల విడుదలైన 'కరుప్పు' చిత్రం ఘన విజయం సాధించింది. హీరో సూర్య కెరీర్‌లో దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. అలాగే శివకార్తికేయన్ “సేయోన్' పేరుతో ఓ ఆధ్యాత్మిక చిత్రాన్ని తీస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ ఈ తరహా చిత్రాన్ని ఎంచుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

మరో స్టార్ ధనుష్.. వెట్రిమారస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నటినయ నతార 'మూక్కుత్తి అమ్మన్-2' అనే భక్తి చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన తొలి భాగానికి ఇది సీక్వెల్. సుందర్ దర్శకుడు. చిత్రీకరణ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

Updated Date - Jul 13 , 2026 | 01:02 PM