Border 2: 28 ఏళ్ల తర్వాత ‘బోర్డర్' సీక్వెల్.. ఆసక్తిగా టీజర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:42 PM
భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన హిట్ మూవీ ‘బోర్డర్’ (Border). 28 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్గా ‘బోర్డర్ 2’ (Border 2) తెరకెక్కింది. సన్నీ దేవోల్ (Sunny Deol) ప్రధాన పాత్రలో తొలి పార్ట్ను జె.పి. దత్తా తెరకెక్కించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘విజయ్ దివస్’ని పురస్కరించుకుని మంగళవారం టీజర్ (Border Teaser)ను విడుదల చేశారు.