Kothapallilo Okappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది..
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:03 PM
‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని విజయం అందుకున్నారు నిర్మాత ప్రవీణ పరుచూరి. తదుపరి ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడామె ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu) అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. రానా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసారు మేకర్స్.