Dhanush: 'కుబేర'.. టచ్ చేసే పాట
ABN , Publish Date - Jun 18 , 2025 | 09:24 PM
నాగార్జున, ధనుష్, రశ్మిక మందణ్ణ కీలక పాత్రలు పోషించిన 'కుబేర' నుండి నాలుగో పాట విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని నందకిశోర్ రాశారు.
ధనుష్, రశ్మిక మందణ్ణ, నాగార్జున కీలక పాత్రలు పోషించిన సినిమా 'కుబేర'. ఈ నెల 20న మూవీ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని నాలుగో పాటను మేకర్స్ బుధవారం రాత్రి విడుదల చేశారు.
బిచ్చగాడైన తన కొడుకుకు బాగు కోరుతూ ఓ తల్లి పాడే పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను నందకిశోర్ రాయగా, సింధూరి విశాల్ పాడింది. నేపథ్య గీతంగా వచ్చే ఈ పాటను మూవీలోని కొన్ని సన్నివేశాలపై వీడియోగా కట్ చేసి మేకర్స్ రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ పాట ఉంది. ధనుష్ కు ఈ సినిమాతో మరోసారి జాతీయ అవార్డు వస్తుందనే ఆశాభావాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ఎందుకు వ్యక్తం చేశాడో ఈ పాటలోని విజువల్స్ చూస్తే అర్థమౌతుంది. బిచ్చగాడిగా అత్యంత సహజమైన ఆహార్యంలో ధనుష్ కనిపించడం విశేషం.