Shashtipoorthi: రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే

ABN , Publish Date - May 11 , 2025 | 12:27 PM

డా. రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్ , ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా  తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టిపూర్తి ‘ (

డా. రాజేంద్రప్రసాద్(Rajendraprasad), అర్చన (Archana) ముఖ్య తారలుగా, రూపేష్(Rupesh), ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) హీరో హీరోయిన్లుగా  తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టిపూర్తి ‘ (Shashtipoorthi). పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ( MAA AAIE )  ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30 న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా లోని రెండు పాటలను,టీజర్ ను విడుదల చేయగా విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు మూడో పాట “ రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే , నీ మాటే నచ్చే – మది మరుమల్లై విచ్చే, చూస్తే పడతా – చేస్తే చెడతా కట కటా ..! , పద – దోస్తీ కడతా – కుస్తీ పడతా -వలపు వాకిటా ..! “ ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా , నిత్య శ్రీ ఆలపించారు. జంగ్లీ మ్యూజిక్ సంస్థ ఈ పాటను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ – "మా నాన్న సంగీత దర్శకత్వంలో ఈ తెలుగు పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా కూల్ సాంగ్. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను కూడా ఈ ‘షష్టిపూర్తి‘ టీమ్ లో భాగమైనందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ “ అని చెప్పారు. 

దర్శకుడు పవన్ ప్రభ , నిర్మాత – కధానాయకుడు రూపేష్ ఈ పాట గురించి వివరిస్తూ – “ సరిగ్గా సినిమా ఓపెనింగ్ జరిగిన రోజునే ఈ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజా గారు . ఈ సిట్యుయేషన్ కి , ఈ పాట మూడ్ కి యువన్ శంకర్ రాజా వాయిస్ అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నాం. కానీ, ఇళయరాజా గారు వేరే కొత్త తమిళ  సింగర్ తో ఈ పాట పాడించేశారు. తర్వాత మేం పట్టు పట్టడంతో యువన్ శంకర్ రాజాతో పాడించారు.  ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ఒకెత్తయితే,  ఈ పాట ఫుల్ రొమాంటిక్ జోష్ తో ఉంటుంది. ఈ సినిమా మొత్తం మీద బాగా ఖర్చు పెట్టి తీసిన పాట ఇదే. ప్రసిద్ద కళా దర్శకులు తోట తరణి గారు ఈ పాట కోసం నాలుగు సెట్లు వేశారు. పాట చాలా రిచ్ గా  బాగా వచ్చింది” అని చెప్పారు.

Updated Date - May 11 , 2025 | 12:28 PM