కథకు ఎక్కువ సమయం పట్టింది

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:41 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. తాజాగా అయాన్‌ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకొన్నారు.

  • అయాన్‌ ముఖర్జీ

జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. తాజాగా అయాన్‌ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకొన్నారు. ‘వార్‌-2’ కథను సిద్ధం చేయడంలో తాను ఎక్కువ సమయాన్ని వెచ్చించినట్లు చెప్పారు. ‘వార్‌ సినిమాకు ఫ్రాంచైజీని రూపొందించడం, దానిపై నాదైన ముద్ర వేయడానికి కష్టపడడం ఓ పెద్ద బాధ్యతగా భావించాను. ‘వార్‌-2’ను డైరెక్ట్‌ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్‌ చేసినట్లే భావించాను. బ్లాక్‌బస్టర్‌ ఫ్రాంచైజీలో మన సినిమా భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు.


ఇదివరకే ఘన విజయం సాధించిన సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దానికంటూ ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. అందువల్ల ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించేలా ‘వార్‌-2’ని తెరకెక్కిస్తున్నాం. ఎన్టీఆర్‌, హృతిక్‌ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించాం. వీరిద్దరి కలయికపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు. అలాంటి వారికి జీవితకాల అనుభూతిని కలిగించేలా ఈ సినిమా ఉండాలనే ఆలోచించాం. భారతీయ చిత్రపరిశ్రమ గర్వపడేలా ‘వార్‌-2’ని తెరకెక్కించాం’ అని తెలిపారు. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Updated Date - Jun 21 , 2025 | 06:41 AM