విష్ణు వంద శాతం న్యాయం చేశారు

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:45 AM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న...

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు.

  • కన్నప్ప కోసం ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, మోహన్‌ బాబు, విష్ణు, బ్రహ్మానందం ఇలా.. అందరితో కలసి పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఈ వయసులోనూ మోహన్‌బాబు ఎంతో ప్యాషనేట్‌గా పనిచేశారు.

  • కన్నప్ప మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకొన్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. సినిమాలో చివరి గంట అద్భుతంగా ఉంటుంది.

  • మా ఆర్ట్‌ డైరెక్టర్‌ చాలా రీసెర్చ్‌ చేశారు. ఎన్నో మ్యూజియాలను సందర్శించారు. ఆయుధాలు, వస్త్రధారణ వంటి విషయాలపై చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం కాలంనాటి వాతావరణ పరిస్థితులను తెరపై చూపడానికి చాలా ప్రయత్నించాం. అందుకే సినిమాను న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించాం.

  • ప్రభాస్‌ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్‌ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. అద్భుతంగా ఉందని వారు మెచ్చుకున్నారు.

  • కన్నప్ప అనేది మైథాలజీ కాదు. ఇది మన చరిత్ర. కన్నప్ప అనేవాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 05:45 AM