సేతుపతితో సంయుక్త
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:10 AM
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చార్మీ కౌర్తో కలసి నిర్మిస్తున్నారు...
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చార్మీ కౌర్తో కలసి నిర్మిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో టబు, దునియా విజయ్కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం కథానాయిక పేరును ప్రకటించింది. విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తున్నట్లు తెలిపింది. ‘మూస ధోరణిలో సాగే కథానాయికల పాత్రలకు భిన్నంగా ఇందులో సంయుక్త పాత్ర ఉంటుంది, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు, చిత్రీకరణలో పాల్గొనేందుకు సంయుక్త ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు’ అని మేకర్స్ తెలిపారు.