ఇదో అద్భుతమైన వేదిక

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:32 AM

సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్‌ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా...

సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్‌ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్‌ రాజు’ డ్రీమ్స్‌ లక్షలాది మందికి ఒక హోప్‌ ఇచ్చింది. కొత్తవారికి ఇదో అద్భుతమైన వేదిక’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి వెబ్‌సైట్‌ను నేనింతవరకూ చూడలేదు. కొత్తవారి కోసం ఇలాంటిది లాంఛ్‌ కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్తవారికి సరైన గైడెన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఆలోచనే ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’. ఇది సినీ ఔత్సాహికులకు సరైన వేదిక అవుతుందని ప్రారంభిస్తున్నాం. అప్లై చేసుకునే వారికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్‌ మాట్లాడుతూ ‘‘మీ ప్రతిభతో ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోవద్దు’’ అని కోరారు.

Updated Date - Jun 29 , 2025 | 02:35 AM