Vijay Devarakonda case: విజయ దేవరకొండపై కేసులో ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ రికార్డు
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:23 PM
సినీనటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తును మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు.
సినీనటుడు విజయ్ దేవరకొండపై (Vijay Devarakonda) ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తును మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుడు అశోక్కుమార్ (Ashok kumar) నాయక్, ఏసీపీ ముందు తన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అన్ని కోణాల్లో కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (sc st atrocity case)
ఏప్రిల్ 26న జరిగిన 'రెట్రో'ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్ర దాడి అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘కశ్మీర్ మనదే.. కశ్మీర్ ప్రజలు మనవాళ్లే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్ యుద్ధం చేసిన రీతిలో పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేస్తోంది. కానీ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తిండి, నీళ్లు లేక వాళ్ల ప్రజలే పాకిస్తాన్పై యుద్ధం చేస్తారు’ అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ చేసినట్లుగా’అనే వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరిచాయంటూ ట్రైబల్ కమ్యూనిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ నాయక్ అలియాస్ అశోక్ రాథోడ్ ఈ నెల 17న రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేయగా, న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. విజయ్ దేవరకొండపై శనివారం అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.