Mega 157: వెంకీ రాకకు వేళాయె..

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:42 PM

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 157వ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అనిల్‌ రావిపూడి, చిరు కలిసి వాయువేగంతో చిత్రీకరణ చేస్తున్నారు.

Chiranjeevi and Venkatesh

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా తెరకెక్కుతున్న 157వ (Mega 157) షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అనిల్‌ రావిపూడి, చిరు కలిసి వాయువేగంతో చిత్రీకరణ చేస్తున్నారు. మిస్సోరిలో జరుగుతున్న షెడ్యూల్‌లో కథానాయిక నయనతార (Nayantara) ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడాయన యన రంగంలోకి దిగేందుకు సిద్థమవుతున్నట్లు తెలిసింది. త్వరలో హైదరాబాద్‌లో మొదలు కానున్న తాజా షెడ్యూల్‌లో వెంకీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారట.



వెంకీ పాత్ర ఈ కథకు చాలా కీలకమని, దీని కోసం నెల రోజులు డేట్స్‌ ఇచ్చాయని చెబుతున్నారు. జులై నెలాఖరుకు వెంకీ పార్ట్‌ చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తోంది. చిరు - అనిల్‌ కాంబో చిత్రం ఇటీవల మిస్సోరీలో రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకుందని చిత్ర బృందం ప్రకటించింది. అక్కడ నయన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వినోదం, యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతలు.  

ALSO READ:
Sekhar Kammula Interview: పాన్‌ ఇండియా అంత ఈజీ కాదు..

Love Marriage: పెళ్లి కోసం ఎన్ని కష్టాలో.. 


Mohanlal: శ్రీలంక పర్యటన మరచిపోలేని జ్ఞాపకం..



Updated Date - Jun 21 , 2025 | 02:05 PM