పదిహేను చిత్రాలకు శ్రీకారం

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:30 AM

భీమవరం టాకీస్‌ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఒకేసారి పదిహేను చిత్రాలకు శ్రీకారం చుట్టారు.

భీమవరం టాకీస్‌ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఒకేసారి పదిహేను చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన మురళీమోహన్‌, రేలంగి నరసింహారావు, సుమన్‌, శ్రీకాంత్‌, జేడీ చక్రవర్తి, తనికెళ్ల భరణి, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్న కుమార్‌, చదలవాడ శ్రీనివాసరావు, భరత్‌ భూషణ్‌తోపాటు ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ పదిహేను చిత్రాలను 2026 ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 03:40 PM