Tollywood: పవన్ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో సినీ పెద్దల మీటింగ్
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:05 PM
తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) చెందిన పెద్దలు, నిర్మాతలు సీఎం నారా చంద్రబాబు 9AP CM Chandrababu naidu) నాయుడిని కలవబోతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) చెందిన పెద్దలు, నిర్మాతలు సీఎం నారా చంద్రబాబు 9AP CM Chandrababu naidu) నాయుడిని కలవబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (APDCM Pawan kalyan) ఆధ్వర్యంలో విజయవాడ ఉండవల్లి నివాసంలో ఈనెల 15, ఆదివారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశంవుమ కోసం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటి వరకూ 48 మంది సినీ ప్రముఖులకు ఫోన్ ద్వారా సమాచారం. అయితే ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రులతో మీటింగ్.. ఏం చర్చించ బోతున్నారో అన్నది ఇప్పుడు ఆసక్తికగా మారింది. సినిమా ఇండస్ట్రీ సమస్యలతోపాటు ఏపీలో షూటింగ్లకు అనుమతులు, పన్నుల విధానం, లొకేషన్ సమస్యలు, టికెట్ రేట్లు, ప్రత్యేక ధరలు ఇతర అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.
ఈ మధ్యనే ధియేటర్ల బంద్ విషయంలో కొంత మంది పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర చేయడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా.. పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం వేధించుకుతిన్నదని అయినా.. తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారా అన్న ప్రశ్నలు పవన్ నుంచి వచ్చాయి. అసలు కొత్త ప్రభుత్వం వచ్చాక టాలీవుడ్ నుంచి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారా అన్నది కూడా అయన ప్రస్తావించారు.
ఇప్పుడు చంద్రబాబును కలిసేందుకు ఎంత మంది ప్రముఖులు వస్తారన్నది కీలకం . ఇండస్ట్రీలో కొంత మంది వైసీపీకి సన్నిహితులు ఉన్నారు. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా.. ఇతరులని ఆపేశారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం బయట పెట్టారు. కలుద్దామంటే.. మనది ప్రైవేటు వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు. ఆయనెవరో ఇండస్ట్రీ వారికి తెలుసు. మరి ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.