Payanam: సరికొత్త కథాంశంతో.. 'పయనం' ప్రారంభం
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:09 PM
రోటి కపడా రొమాన్స్ సుప్రజ్ హీరోగా, 'జనక అయితే గనక' సంగీర్తన నాయికగా నటిస్తున్న నూతన చిత్రం పయనం.
రోటి కపడా రొమాన్స్ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్ (Supraj) హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్ (SangeerthanaVipin) నాయికగా నటిస్తున్న నూతన చిత్రం పయనం (Payanam). ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్ (Chanduram) దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్ చేశారు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక కొత్త కాన్సెప్ట్తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్ను సర్ఫ్రైజ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ మా చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు.
అంతేకాదు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. జూలై 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు.