విభిన్న కథతో

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:28 AM

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి...

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్‌ ఈ చిత్రానికి కథను అందించారు.

Updated Date - Jun 17 , 2025 | 02:31 AM