SSMB29: రామాయణ కథతో మహేష్ - రాజమౌళి సినిమా ..?

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:03 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB29.

SSMB 29

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB29. ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఆర్ఆర్ఆర్(RRR) తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అమెజాన్ అడవుల నేపథ్యంలో ఇండియా జోన్స్ తరహాలో జక్కన్న.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతోంది. గతే రెండు రోజులుగా SSMB29 లో స్టార్ హీరో విక్రమ్(Vikram) ప్లేస్ లో మాధవన్(Madhavan) ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. విక్రమ్, రాజమౌళి కథను రిజెక్ట్ చేశాడని, ఆ పాత్రలో మాధవన్ నటిస్తున్నాడు అని టాక్ నడిచింది. అది ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా మరో వార్త సెన్సేషన్ గా మారింది. అదేంటంటే.. రాజమౌళి ఈ సినిమాను రామాయణ కథతో తెరకెక్కిస్తున్నాడట. రామాయణంలో ఏ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుడు గాధల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఆయన సంజీవని ఔషధాన్ని తీసుకురావడం కోసం చేసిన సాహసాన్ని ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు ఆ కథతోనే రాజమౌళి SSMB29 ను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి ప్రాణం కాపాడడానికి మహేష్.. సంజీవని కోసం అమెజాన్ అడవుల్లో తిరుగుతాడని, దానికోసం మహేష్ చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయని చెప్పుకొస్తున్నారు. ఈ సంజీవని కోసం కొన్ని టీమ్స్ కూడా పోటీపడతాయని, వారందరిని దాటుకొని మహేష్ సంజీవని పొందడా..? అనేది కథగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

Updated Date - Jun 10 , 2025 | 04:03 PM