Keerthy Suresh: భర్తతో.. మాల్దీవ్స్లో చిల్ అవుతున్న కీర్తి సురేశ్
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:36 AM
కీర్తి సురేశ్.. టోటల్ సౌత్కు ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరున్న నటి.
కీర్తి సురేశ్ (Keerthy Suresh).. టోటల్ సౌత్కు ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరున్న నటి. మహానటితో అలిండియా లెవల్లో అదిరిపోయే పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆపై బాలీవుడ్ వరకు వెళ్లి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
గత సంవత్సరం తన బాల్య మిత్రుడినే వివాహం చేసుకున్న ఈ నటి ఆపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా సినిమాల చేస్తూ, ప్రమోషన్లలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది.
2000వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళ చిత్రంతో ఆరంగేట్రం చేసిన కీర్తి 2015లో నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఈ యేటితో దశాబ్దం పూర్తి చేసుకుంటుండగా మొత్తంగా ఇండస్ట్రీలో పాతికేళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం.
చివరగా గతేడాది బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి ప్రస్తుతం తమిళంలో రివాల్వర్ రీఠా, కన్నివేడి అనే సినిమాలు చేస్తోండగా హిందీలో ఓ చిత్రం చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పెళ్లి అనంతరం సినిమాల సంఖ్య తగ్గించిన ఈ ఆమ్మడు సమయం దొరికితే భర్తతో వెకేషన్కు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్త ఆంటోనితో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన కీర్తి (Keerthy Suresh) అక్కడ రిసార్ట్స్, బీచ్లలో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది.
గతానికి భిన్నంగా కాస్త గ్లామర్ డోస్ సైతం పెంచి ట్రీట్ ఇస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్ను ఆనంద పరుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.