Nagachaitanya@25: ఈసారి ఫీల్ గుడ్ ఎమోషన్తోపాటు యాక్షన్ కూడా..
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:50 PM
నాగ చైతన్య తన 24వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే చై ఈ సినిమా చేస్తూనే తన 5వ సినిమా గురించి కూడా రంగం సిద్దం చేస్తున్నాడు.
నాగచైతన్య (Naga chaitanya)- కార్తీక్వర్మ దండు (Karthik Dandu) కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! చైతన్యకు ఇది 24వ సినిమా. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే చై ఈ సినిమా చేస్తూనే తన 5వ సినిమా గురించి కూడా రంగం సిద్దం చేస్తున్నాడు. తనతో 'మజిలీ’ చిత్రం తీసిన దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పేశాడట. కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అతను చెప్పిన కథతోనే తన 25వ సినిమాగా పట్టాలెక్కిస్తే బాగుంటుందని చైతూ భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇప్పటికే నిర్మాతలు హీరోకి, దర్శకుడిగా అడ్వాన్స్ ఇచ్చారని టాక్. దర్శకుడు శివ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజిలి’ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరవాత నానితో తీసిన టక్ జగదీష్’ సరైన ఫలితం ఇవ్వలేదు. అప్పటి నుంచి శివ కథలపై దృష్టి పెట్టాడు. సరైన అవకాశం కోసం ఎదురు చూశారు. ఈసారి కూడా తనదైన శైలిలో ఫీల్ గుడ్ ఎమోషన్తోపాటు కాస్త యాక్షన్ కథ రాసుకున్నాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక్ వర్మ నాగచైతన్యతో తీస్తున్న సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలిస్తునట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. స్టూడియోలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ కొంత పూర్తి చేశారు. అక్కడ కొంతమేర షూటింగ్ చేశారు. ప్రస్తుతం మరో కీలక షెడ్యూల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.