X ROADS: 25 రోజులు పూర్తి చేసుకున్న.. శశి ప్రీతమ్ సినిమా
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:40 PM
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు, పేరున్న నటీనటులు ఎవరూ లేకుండా ఇటీవల థియేటర్లకు వచ్చిన లో బడ్జెట్ చిత్రం ఎక్స్ రోడ్స్ (X ROADS). నాటి గులాబీ ఫేమ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ (Shashi Preetam) రచించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని సంచలనం నమోదు చేసింది. 90 వెబ్ సిరీస్ ఫేమ్ స్నేహాల్ కామత్ ( Shashi Preetam) లీడ్ రోల్ లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మే 30న పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలై ఇప్పటికీ ఒకట్రెండు స్క్రీన్లలో ప్రదర్శితమౌతోంది. క్రియేటివ్ స్పీసెస్ ఆధ్వర్యంలో ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మాణ సారధ్యంలో దుష్యంత్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విజయోత్సవ సభ సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు,సాంకేతిక నిపుణులకు శశి ప్రీతం సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య కృష్ణప్రియ మాట్లాడుతూ ఈ విజయం ఒక సమిష్టి కృషి అని చిన్న సినిమాకు దక్కిన పెద్ద విజయం అన్నారు. సహనిర్మాత దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు శశి ప్రీతంపై ఉంచిన నమ్మకం మంచి విజయం అందించిందని అన్నారు అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా 35 మంది కొత్త నటీనటులు సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారన్నారు.
నటుడు లోహిత్ కుమార్ మాట్లాడుతూ చిన్న సినిమాల విడుదలే గగనం అవుతున్న ఈ రోజుల్లో 25 రోజులు పూర్తి చేసుకోవడం సిల్వర్ జూబ్లీలా అనిపిస్తోందన్నారు. శశి ప్రీతం మాట్లాడుతూ చిన్న సినిమా పెద్ద సినిమా అని చిత్ర పరిశ్రమలో లేదని ఇది ఒక ఇండిపెండెంట్ కాన్సెప్ట్ సినిమా అని మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారన్నారు. ఆపై తన నిర్మాణ సారధ్యంలో రాబోయే "అమ్మ" "నువ్వున్నావని" "అన్ ఫ్యూచర్" అనే చిత్రాల కాన్సెప్ట్ పోస్టర్స్ విడుదల చేశారు, సైమాక్స్ (Cymax) ఛైర్మన్ గౌరి శంకర్ రాబోయే ప్రాజెక్ట్లలో సహకారం ప్రకటించారు.