Sekhar Kammula: ఆయనతో సినిమా తీయాలనే ఫీలింగ్ అంతే..
ABN , Publish Date - May 31 , 2025 | 04:56 PM
శేఖర్ కమ్ముల (Sekhar kammula) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా ఆయన స్టైల్ వేరు. ఆయన చిత్రాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. విలువలకు పెద్ద పీట వేస్తారు.
శేఖర్ కమ్ముల (Sekhar kammula) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా ఆయన స్టైల్ వేరు. ఆయన చిత్రాల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. విలువలకు పెద్ద పీట వేస్తారు. అసభ్యతకు చోటే ఉండదు. డాలర్ డ్రీమ్(2000) చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైప్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, లవ్స్టోరీ, ఫిదా వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. ఈ ఏడాదితో ఆయన ఫిల్మ్మేకర్గా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 25 ఏళ్ల సెలబ్రేషన్స్ చిరంజీవి (Chiranjeevi) సమక్షంలో చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భావోద్వేగ పోస్ట్ చేశారు. (Sekhar kammula completes 25 years)
"టీనేజ్లో ఒక్కసారి చిరంజీవిగారిని చూశా. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ర్టీకి వచ్చి 25 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అని నా టీమ్ అంటే నాకు గుర్తొచ్చిన మొదటి వ్యక్తి చిరంజీగారే. కొన్ని జనరేషన్స్కు ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి ఆయన. 'డ్రీమ్స్ని ఛేజ్ చేయండి. సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. కాబట్టి నా 25 ఏళ్ల జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన ప్రజెన్స్లోనే చేసుకోవాలి అనిపించింది. ఽథ్యాంక్యూ సర్. ఈ సమయంలోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’’ అని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున కీలక పాత్రధారులుగా కుబేర చిత్రం రూపొందుతుంది.