Rashmika Mandanna: రష్మిక.. ఏంటి ఇంత షాక్ ఇచ్చింది
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:52 AM
బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా కొత్త సినిమా ప్రకటనతో షాక్ ఇచ్చింది
బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా (RashmikaMandanna) ఇటీవల కుబేర సినిమాతో తన అకౌంట్లో మరోపెద్ద విజయం వేసుకుంది. ఈ సినిమా అనంతరం అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ఫ్రెండ్ అనే లేడీ ఒరియంటెడ్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అది అలా షూటింగ్ దశలో ఉండగానే తాజాగా టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అన్ ఫార్మూలా ఫిల్మ్స్ (UnFormula Films) ఈ సినిమాను నిర్మిస్తోంది.
మైసా (Mysaa) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంతో.. సీతారామం, ఫౌజీ చిత్రాల డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె (Rawindra Pulle) దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ప్రముఖ అదివాసి జాతి అయిన గోండు తెగ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఎలాంటి భయం లేని ఓ వీరనారి పాత్రలో రష్మిక నటించబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్స్ ఇంటర్నెట్ను షుక్ చేస్తుండగా పోస్టర్లో రష్మిక లుక్ను చూసి అంతా స్టన్ అవుతున్నారు. ఇదిలాఉంటే తెలుగుతో పాటు పాన్ ఇండియాగా తెరకెక్కున్న ఈ చిత్రం ఫష్ట్ లుక్ను కాసేపటి క్రితం ధనుష్ (Dhanush) తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం విశేషం.