Ram Charan: యాక్షన్ సీక్వెన్సులో
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:41 AM
రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది...
రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్ యాక్షన్ సీక్వెన్సును తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా డీఓపీ రత్నవేలు రామ్చరణతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో రామ్చరణ్ చాలా సీరియస్ లుక్లో శక్తిమంతంగా కనిపించారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్కు మంచి ఆదరణ దక్కింది. జాన్వీ కపూర్ కథానాయిక. జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదలవనుంది.