Rajasimha Tadinada: నరకపు అంచుల దాకా వెళ్లొచ్చా.. ప్లీజ్ ఆదుకోండి...
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:53 PM
సినీ రచయిత, దర్శకుడు రాజసింహ తాడినాడ (Rajasimha Tadinada request) కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే! ఏడాదిన్నర ఆస్పత్రికే పరిమితమైన ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ సినిమారంగంలో బిజీ కావాలనుకుంటున్నారు.
సినీ రచయిత, దర్శకుడు రాజసింహ తాడినాడ (Rajasimha Tadinada request) కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే! హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతుండగా ‘మహీంద్రా బొలెరో’ వాహనాన్ని తప్పించబోయి రాజసింహ, ఎదురెదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో రాజసింహ (Rajasimha Tadinada) ఎడమ కాలు విరగడంతో పాటు శరీరానికి పలు గాయాలయ్యాయి. 108 వాహనం’లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. దాదాపు ఏడాదిన్నర ఆస్పత్రికే పరిమితమైన ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ సినిమారంగంలో బిజీ కావాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన అవకాశాల కోసం విజ్ఞప్తి చేశారు.
"చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చాను. దాదాపు నరకపు అంచుల వరకు వెళ్లొచ్చాను. ఇప్పుడే కాస్త కోలుకున్నాను. ఇక రచయితగా నా వర్క్పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. పరిశ్రమలో రచయితగా సుధీర్ఘ అనుభవం ఉన్న నేను మళ్లీ పెద్ద దర్శకుల టీమ్లో చేరి పని చేయాలనుకుంటున్నాను. దయ చేసి నాకు అవకాశాలు కల్పించండి. పూర్తిగా పని మీద దృష్టి పెడతాను. త్వరలోనే నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నా’’ ఆయన ఓ మెసేజ్ ద్వారా పరిశ్రమలో రచయితలు, దర్శకులను కోరుతున్నారు రాజసింహ (Rajasimha Tadinada request to TFI))
రాజసింహ తాడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశారు. అల్లు అర్జున్తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు. ఆ చిత్రంలో బన్నీ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’. పాత్రకు ఆయన డైలాగ్లు రాశారు. ునేను బాష లెక్క ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అనే డైలాగ్ రాసింది ఆయన. ఈ క్రేజ్ తో దర్శకుడిగా మారి సందీప్ కిషన్ తో ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమా చేశారు.