Rajamouli Latest Film: టాంజానియాలో చిత్రీకరణకు సిద్ధం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:41 AM
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం (‘ఎస్ఎ్సఎంబీ 29’- వర్కింగ్ టైటిల్) కొత్త షెడ్యూల్కు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్లో చిత్రీకరణ కోసం యూనిట్ సన్నద్ధమవుతోంది. మహేశ్బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్సుకుమారన్పై ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత దక్షిణాఫిక్రాలో కొంత భాగం చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని యాక్షన్ ఘట్టాలను తొలుత కెన్యాలో చిత్రీకరించాలనుకున్నా అక్కడున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో చిత్రబృందం టాంజానియా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి