సరికొత్త కథాంశంతో పయనం

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:28 AM

‘రోటీ కపడా రొమాన్స్‌’ ఫేమ్‌ సుప్రజ్‌, సంగీర్తన విపిన్‌ జంటగా ‘పయనం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణకమల నిర్మిస్తున్నారు...

‘రోటీ కపడా రొమాన్స్‌’ ఫేమ్‌ సుప్రజ్‌, సంగీర్తన విపిన్‌ జంటగా ‘పయనం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణకమల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ క్లాప్‌ ఇవ్వగా, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా చందురామ్‌ మాట్లాడుతూ ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న సస్సెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 09 , 2025 | 04:28 AM