Chiranjeevi: నాగార్జున తీసుకున్న నిర్ణయం అందుకు స్ఫూర్తి
ABN , Publish Date - Jun 23 , 2025 | 10:47 AM
ఓటీటీ ఎంట్రీకి సిద్ధమేనన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన 'కుబేర' (Kubera) చిత్రంగ్రాండ్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
ఓటీటీ (Ott entry) ఎంట్రీకి సిద్ధమేనన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన 'కుబేర' (Kubera) చిత్రంగ్రాండ్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఆయన స్పీచ్తో ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచారు. తన స్నేహితుడు నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించి, ఎన్నో విషయాల్లో నాగార్జున తనకు స్ఫూర్తి అని తెలిపారు. "ఆరోగ్యం, నడవడిక, ఆలోచనలు, స్థితప్రజ్ఞత.. ఇలా ఎన్నో విషయాలు నాగ్లో నాకు నచ్చుతాయి. ఏం జరిగినా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. నేను కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వచ్చి ఓటీటీలో సినిమాలు చేయాల్సి వచ్చినా రెడీ.. దానికి ఇప్పటినుంచే మానసికంగా సిద్థంగా ఉండాలి. ఈ విషయంలోనూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నాకు స్ఫూర్తి. 'ఓటీటీకి రెడీ అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చేయకండి’ అని అన్నారు చిరంజీవి.
ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్గా మారాయి. త్వరలోనే ఆయన్ను ఓటీటీలో కూడా చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. చాలామంది హీరోలు ఇప్పటికే ఏదోలా ఓటీటీల్లో దర్శనమిస్తున్నారు. బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్ ‘రానా నాయుడు’ రెండు పార్టుల్లో నటించి, ఆయనలో కొత్త కోణాన్ని బయటకు తెచ్చారు. చిరంజీవి కూడా ఓటీటీకి వస్తారని గతేడాది టాక్ వచ్చింది. అయితే బలమైన కథ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఓటీటీకి కంటెంటే బలం. చిరు ప్రకటనతో రచయితలు మేకర్స్ కథలతో క్యూ కడతారేమో చూడాలి. ప్రస్తుతం చిరు రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకటి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర కాగా, రెండోది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157. విశ్వంభర చిత్రీకరణ పూర్తి చేసుకుని సీజీ పనుల్లో ఉంది. మెగా 157 మూడో షెడ్యూల్కి వెళ్తుంది.