Morgan Movie: ఏషియన్ సురేశ్ ద్వారా మార్గన్
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:59 AM
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్’. లియో జాన్పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా పరిచయం అవుతున్నాడు.
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్’. లియో జాన్పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్గా పరిచయం అవుతున్నాడు. మర్డర్ మిస్టరీ- క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ‘మార్గన్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేశ్బాబును విజయ్ ఆంటోని కలిశారు. థ్రిల్లింగ్ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని విజయ్ ఆంటోని తెలిపారు.