Manchu Lakshmi: ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం.. ఆమె ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:53 AM
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్కు వెళ్లారు.
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్లు చేశారు. అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఫ్లైట్ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.